Breaking News

యేసువారు ఇశ్రాయేలు జాతి సంస్కరణ కొరకు దేవుని చేత పంపబడిన ఒక దైవప్రవక్త (రుషి)! ఆయనను దేవుడని భారతీయులపై రుద్దడం, నమ్మబలికించడం ఎంతవరకు సమంజసం?


10 comments:

  1. "యేసువారు" దేవునికుమారుడు కాదుకదా, ప్రవక్తకూడా కాదని secular చరిత్రకారుల అభిప్రాయం. "యేసువారు" ఒక ఉద్యమకారుడు, యూదుప్రజలపై రోమనుల ఆధిపత్యాన్ని ఎదిరించి, యూదులను సంఘటిత పరిచినవాడు.

    మహమ్మదూ అదే యూదుల domination నుండి అరబ్బులను సంఘటితపరచినవాడు, అరబ్బులందరినీ వారివారి తెగలకతీతంగా ఒకదేవుని పేరున సంఘటిత పరిచినవాడు.

    వీరిరువురూ తమప్రజలలో ధైర్యాన్ని ప్రోదిచెయ్యడానికే తాము దేవుడికి సమీపమైనవాళ్ళమని చెప్పుకున్నారు. తమతమ జాతి ప్రజలను దేవునిముద్దుబిడ్డలుగా(chosen people) ప్రకటించారు (ఈవిషయంలో హిట్లరు వాడిన Herrenvolk గుర్తుకొస్తే అది మీతప్పు కాదు). వీళ్ళిద్దరూ తమ విశ్వాసాలను తమ ప్రాంతానికే పరిమితమని భావించారు. అప్పుడు ఇస్లాం మాత్రం ఇండియాలో ఎందుకుండాలి?

    ఏమతమైనా, ఏదేవుడైనా మానవసృష్టిగాక మరొకటికాదు.

    ReplyDelete
    Replies
    1. యేసు, ప్రవక్త(స)వారు సమాజదృష్టిలో చూస్తే విప్లవకారులే! అయితే ముఖ్యంగా అధ్యాత్మిక పరిధిలో చూడాలి. అలా చూసినప్పుడు వారు ప్రవక్తలనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.ఇకపోతే మీరన్నట్టుగా వీళ్లు తమ,తమ జాతులను సంస్కారవంతంగా తీర్చిదిద్దుతూ, మూఢ నమ్మకాలను నిర్మూలిస్తూ నిజమైన దైవభావనను నెలకొల్పారు తప్ప మీరన్నట్టు ఒక జాతి నుండి మరొక జాతిని గొప్ప చేయడానికి, లేక తమ జాతుల ఆధిపత్యం కోసం వారు పోరాటాలు సలిపినట్టు దాఖలాలు లేవు. జరిగిందంతా ధర్మాధర్మాల మధ్య పోరాటం మాత్రమే! మీరంతా ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చూసినప్పుడు అర్ధమవుతుంది. ఇక మీ విషయానికి వస్తే కేవలం మీరు ఊహాజనితంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ల చరిత్రను అధ్యయనం చేసి కాదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. మరొక ముఖ్యవిషయం యేసు పరిధి వేరు. ముహమ్మద్(స) పరిధి వేరని గమనార్హం.

      Delete
    2. బైబిల్‌ని historically accurate documentగా చరిత్రకారులు పరిగణించరు. బైబిల్‌లో చెప్పినవాటినీ వేటినీ ఆనాటి సమకాలీన చరిత్రకారులు (ముఖ్యంగా తమకు జరిగిన ఘోర పరాజయాలనూ, తమ ఫారోలు చేసిన ఘోరకలులనుకూడా ఎంతో నిజాయితీగా documnet చేసిన ఈజిప్టు చరిత్రకారులు) ఎవరూ వాటినినిజమని సమర్ధించలేదు. ఒకవేళ చరిత్ర అనడంలో మీ ఉద్దేశ్యం బైబిలో, ఖురానో ఐనట్లైతే నాకు వాటి విశ్వసనీయతలమీద సందేహాలున్నాయి.

      జీసస్ ఒక demagogue అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఆయన అణగద్రొక్కబడిన జాతిని కేవలం ఉత్తేజితం చేశాడు. ఆ క్రమంలో మీరు 'దేవునికి అత్యంత ఇష్టమైనవారు. అలాంటి మీరు ఇలా ఇంకొకరి ఆధిపత్యానికి తలొగ్గి బ్రతకడమేమిటి?' అని అనడం నాదృష్టిలో తప్పుకాదు. రోగికి బలవర్ధకమైన ఆహారం కావాలి. యూదులకవసరమైన ఆ బలాన్ని జీసస్ ఇచ్చాడు. తరువాతికాలంలో యూదులవల్ల dominate చెయ్యబడుతున్న అరబ్బులకు మహమ్మద్ అదే మందిచ్చాడు. ఐతే ఈ బలమ్మందు పనిచెయ్యాలంటే రోగికి డాక్టరుపై నమ్మకం కుదరాలి. అంటే 'డాక్టరుగారి డిగ్రీ ఏమిటట? యఫ్ఫార్సీయస్సా, యంబీబీయస్సా?' అన్న ప్రశ్న అన్నమాట. 'దేవుని కుమారుడు', 'దేవునిచే ఎన్నుకోబడినవాడు'(ముస్తఫా) అన్న డిగ్రీలు అందుకే అవసరమయ్యాయి. నేను అనవసరంగా medicineని పోలికగా వాడుకున్నానుగానీ. ఈమొత్తాన్నీ పాముమంత్రంతో పోల్చవచ్చు. కేవలం మంత్రగాడిమీద నమ్మకం భయంతోపోయే ప్రాణాలను (పాము విషమున్నదైతే మంత్రం పనిచెయ్యదు) ఆపుతుంది.

      మహమ్మద్ పరిధి వేరు నిజమే కానీ ఆయన పరిధిలోకి భూగోళమంతా fit అయ్యిందని అనుకోను. ఒక చిన్న ప్రశ్న. మహమ్మద్ 'barakh' అధిరోహించి స్వర్గానికి వెళ్ళింది al-aqsa వద్ద అని చెబుతారు. al-aqsa అంటే '(భూమి) అంచు' అని అర్ధం. ఆ so called 'అంచు' పాలస్తీనాలో ఉంది. ఇంచుమించు గోళాకృతిలో ఉండే భూమికి అంచుగా ఏ ప్రాంతాన్నీ చెప్పలేం.

      Delete
  2. యేసు ప్రవక్తలలో ఒకరని ముస్లిముల నమ్మకం. దీన్ని నాస్తికులు & క్రిస్టియన్, హిందూ తదితర మతాల వారి మీద రుద్దలేము.

    ReplyDelete
  3. చౌదరి గారూ, మథయ్య 28:19 అర్ధం ఏమిటో చూస్తె మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇంకా అనుమానం ఉంటె యోహాన్ 10:30, పీటర్ 1:1 వగైరా చదవండి.

    ReplyDelete
    Replies
    1. సర్వసృష్టికి వెళ్లి శిష్యులను సువార్త ప్రకటించమని చెప్పిన యేసు కేవలం ఇశ్రాయేలు ఇంటిలోని నశినచిన గొర్రెలయొద్దకే ఎందుకు వెళ్లమని ఆజ్ఞాపించినట్టు? జైగారు.అంటే యేసు రెండు విధాల మాటలు మాట్లాడినట్టా? అది కాదుగాని సర్వసృష్టికి వెళ్ళి నశించిన ఇశ్రాయేలు సమస్త జనులకు సువార్త అందించమన్నదే ఆయన ఉద్దేశ్యం.ఈ విధంగానే రెండు వాక్యాలు అన్వహించబడుతున్నాయి.ఇది కాకపోతే రెండు వాక్యాలు పరస్పర విరుద్ధమే అవుతాయని మనవి.

      Delete
    2. "Therefore go and make disciples of *all nations*, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit"
      Matthew 28:19

      "I and the Father are one"

      John 10:30

      "Peter, an apostle of Jesus Christ, To those who are elect exiles of the Dispersion in Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia"

      Peter 1:1

      Delete
    3. యోహాన్ 10:30ప్రకారం యేసు-తండ్రి(యెహోవా) ఏకమై యున్నారని మనం యేసును దేవుడనుకుంటే యోహాను17:22 ప్రకారం మరి శిష్యులు కూడా ఏకమై యున్నారు గదా? వాళ్లు కూడా దేవుళ్లు అయ్యిపోతారా సర్? ఇక మరొక వాక్యం మత్తయి 28:19కి పేతురు 1:1కి సమాధానం ఈ క్రింది లింక్ లొ చూడగలరు. స్పందనకు కృతజ్ఞతలు జైగారు.
      http://www.sakshyammagazine.com/2015/02/2.html

      Delete
    4. యోహాన్ 17:22 మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు.

      "I have given them the glory that you gave me, that they may be one as we are one"

      - యేసు యెహోవా ఒక్కరే
      - యెహోవా తనకు ఇచ్చిన ఫలాన్ని యేసు ప్రజలలో పంచారు
      - దీనితో ప్రజలు ఒకటయ్యారు

      మనం ఇద్దరం ఎలా ఒకటో అలానే ప్రజలు తమ మధ్యన బేధాలు తొలగి ఒకటవుతారు అని అర్ధం చేసుకోవాలి. మీరు ప్రజలు, యేసు, యెహోవా ఒకటవుతారని చేసిన అన్వయం సరికాదు.

      మత్తయి 28:19 భాషకు మీ తెలుగు తర్జుమా సరిగ్గా లేదు. అంతేకాక అనే పదాన్ని తెలుగు వ్యాకరణం అన్వయించడం సరికాదు.

      పీటర్ 1:1 గురించి మీరు ఇచ్చిన లింకులో ఏమీ లేదు

      యేసు ఇస్రాయిల్ (పాలస్తీనా) దేశం కోసం పంపబడ్డ ప్రవక్త అనే మీ మరో వాదనను మత్తయ 28:19 (all nations) & పీటర్ 1:1 (Pontus, Galatia etc.) సమర్తించవు. నేను కింద చూపించిన ఆయాతు & హడీస్ ప్రకారం కూడా అరబ్ దేశంలో క్రైస్తవులు ఉండవచ్చునని ఉంది. ఇవ్వాల్టి కూడా (రెండు పవిత్ర నగరాలు మినహాయించి) క్రైస్తవులు అరేబియాలో ఉంటున్నారు. మీరు దీనికి జవాబు చెప్పలేదు.

      Delete
  4. ఒకవేళ మీరు చెప్పిందే నిజమనుకుంటే క్రైస్తవులకు భారత దేశంలోనే కాదు అరేబియాలో కూడా స్థానం లేదు. అలాంటప్పుడు వారి భోజనం తినడం & వారిని వివాహం ఆడడం కుదరదు, కుదిరినా తప్పు.

    "గ్రంధాలను అనుసరించే వారి (యూదులు & క్రైస్తవులు) భోజనం, వారి మహిళలను వివాహం చేసుకోవడం నమ్మిన వారికి (ముస్లిములు) న్యాయ సమ్మతం": 5.5

    మీరు తీసుకున్న స్టాండు పై ఆయాతుకు విరుద్ధం.

    సహాబాలు క్రైస్తవ మహిళ అంత్యక్రియలకు వెళ్లినట్టు సహీ హజ్మ్9964 చెబుతుంది. అలాగే సహీ బుఖారీ 1250 యూదులకు గౌరవం ఇవ్వమని చెబుతుంది. ఈ మతాలు పాలేస్తీనాకు పరిమితం అవ్వాలని శాసించడం ఈ హదీసుల తిరస్కరణ.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్