Breaking News

మతమార్పిడులతోనూ,మతాలను రెచ్చగొట్టే ధోరణులతోనూ దేశాన్ని అట్టుడికిస్తున్న కొన్ని మతసంస్థల వలన బి.జె.పి కి పతనం ముంచుకొస్తుందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా?


4 comments:

  1. మంచి ప్రశ్న. ఈ ధోరణులపై మన వ్యక్తిగత ఆలోచనలను పక్కనబెట్టి చర్చిస్తే బాగుంటుంది.

    భాజపా కేవలం "మత కుడి" వోట్లపై ఆధారపడి ఉంటె గెలిచేది కాదు. అయితే కొన్ని వర్గాలలో (ముఖ్యంగా పట్టణ ప్రాంత చదువుకున్న అగ్రవర్ణ మగ వోటర్లలో) ఈ తరహా బాణీ వల్ల పార్టీకి మంచి లాభం జరిగిందనేది నిర్వివాదాంశం. వీటిని భాజపా వదులుకోగలదా?

    ReplyDelete
  2. మన దేశంలో అత్యధికులు హిందువులు. అందులో అత్యధికభాగం ప్రజలు మతాన్ని రాజకీయాన్ని కలిపి చూడరు. హిందూ మతానికి నిజంగా మీరన్న ప్రమాదకర పరిస్తితులు వస్తే మాత్రం BJP వైపు చూస్తారు తప్ప మిగతా పార్టీలవైపు కాదు. నిజానికి హిందూ మతం లోని కొన్ని ధోరణులే కొందరి ప్రజలను దూరం చేసుకుంటున్నదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పటికీ దేశ ప్రజలు లౌకికవాదాన్నే సమర్ధిస్తున్నారు. కాంగ్రెస్ తో విసిగి , కమ్యూనిస్టులను లేదా తర్డ్ ఫ్రంటునీ నమ్మలేక మోడీ వేవ్‌తో ప్రత్యామ్నయంగా BJP ని చూస్తున్నారు తప్ప హిందూ మత పరిరక్షణకోసం ప్రజలు BJP కి పట్టం కట్టలేదు. మన దేశం ఎప్పటికీ ఏ ఒక్క మత రాజ్యంగా ఉండబోదనేది నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. అత్యధికుల విషయంలో మీరు చెప్పింది నిజం అయినా కాకపోయినా కేవలం వీరి వల్లనే భాజపా గెలువలేదని నా నమ్మకం. అసలుకు కొసరు జోడు అన్నట్టు "మత కుడి" వోట్లతోనే భాజపాకు స్పష్టమయిన బహుమతి వచ్చింది. ప్రస్తుత పరిస్తితులలో వారిని పార్టీ దూరం చేసుకోలేరు కనుకే ఈ పక్క వాయిద్యాలతో వారిని సంతృప్తి పరిచే ప్రయత్నాలు.

      Delete
  3. అసలికి ఈ ప్రశ్నే సరిగా లేదు. మన దేశం పక్క దేశాలవలే గొడవలు, చంపుకోవటాలతో అట్టుడకటం లేదండి. ప్రశాంతంగా ఉంది. అలా ఉండటమేకాక కాష్మీర్లో ప్రశాంతగా ఎన్నికలు ముగిసి, నేడు ఫలితాలు వచ్చాయి. ఈరోజు బిజెపి వారు గెలిచిన సంబరాలు చేసుకొంట్టున్నారు. నార్త్ ఇండియాలో కులాలకతీతంగా ఏకమై బిజెపికి ఓటేస్తున్నారని ఎన్నికల సరళిని బట్టి తెలుసుతుంది. కనుకనే బిజెపి వాళ్ళు హర్యాన,మహారాష్ట్ర, ఝార్ఖండ్ & కాష్మీర్ లలో నేడు గెలవటమే కాక రేపు డిల్లిలో కూడా గెలుస్తారు. ప్రతి రాష్ట్రాంలో బిజెపి గెలుస్తూంటే కొన్ని మతసంస్థలు, ఆపార్టిని పతనం చేస్తాయనుకోవటం హాస్యాస్పదం. ఇక తెలుగు రాష్ట్రాలలో బిజెపి ప్రభావం నామ మాత్రం. ఒకపార్టి మెజారిటి సీట్లు గెలిచినా అవి మహా ఐతే 20సీట్లు గెలుస్తాయి. ఆ 20 సీట్ల తో కేంద్రంలో చక్రం తిప్పలేరు. ఆ రోజులు అయిపోయాయి. కనుక తెలుగువారు వార్తమానం లోను, భవిషత్ లోను కేంద్ర రాజకీయాలలో బిజెపికి మద్దతివ్వటం తప్పించి చేయగలిగింది ఏమిలేదు. మతత్వ పార్టి అది ఇది అని బిగుసుకొని కూచొంటే, కేంద్రంలో వచ్చే రెండు, మూడు మంత్రిపదవులుకూడా రావు. బహుశా అందువలననేమో కె.సి.ఆర్. గారు కూడా బిజెపి తో సయోధ్యకు సిద్దంగా ఉన్నామంట్టు సంకేతాలు పంపిన వార్తలు పేపర్లో వచ్చాయి.
    కొసమెరుపేమిటంటే జనతా పరివార్ అని ఏకమౌతున్న నితిష్ కుమార్,లాలు,ములాయం మొదలైన వారు ప్రయత్నాలు ప్రారంభించారు. కాని నేడు జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ఫలితాల్ను చూస్తే నితిష్ గారికి ఆటే లాభించినట్లు లేదు. అంటే ఎమి సీట్లు వచ్చినట్లు లేదు. రేపు బీహార్ ఎన్నికలలో ఆయన పార్టి పరిస్థితి ఎలా ఉండబోతుందో దీనిని బట్టి ఊహించవచ్చనుకొంటాను.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్